ఏపీ ‘స్థానిక‘ ఎన్నికల్లో అన్ని స్థానాల్లోనూ కాంగ్రెస్ పోటీ చేస్తుంది: శైలజానాథ్
- ఏఐసీసీ సభ్యుడు ధృవకుమార్ రెడ్డి ఇంటికి వెళ్లిన సాకే
- పులివెందులలో ‘కాంగ్రెస్’కి పూర్వ వైభవం తీసుకొస్తా
- సీఏఏ, ఎన్ఆర్సీలపై జగన్ ద్వంద్వ వైఖరి వీడాలి
ఏపీ సీఎం, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ పాలనలో ప్రజలకు ఏమి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. సీఏఏ, ఎన్ఆర్సీలపై జగన్ ద్వంద్వ వైఖరి విడనాడాలని విమర్శించారు. ఈ సందర్భంగా వేంపల్లిలోని ఎంహెచ్పీఎస్, ఆమ్ ఆద్మీ పార్టీల నాయకులు ఆయన్ని సన్మానించారు. సీఏఏ, ఎన్ఆర్సీలను నిరసిస్తూ ఆయనకు ఓ వినతిపత్రం అందజేశారు.