కరోనా ఎఫెక్ట్.. ఈ నెల 31 వరకు ఢిల్లీలో పాఠశాలలకు సెలవులు
- రేపటి నుంచి అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయం
- బిహార్లో పరిశీలనలో 89 మంది
- వారిలో ఇరాన్ నుంచి వచ్చిన వాళ్లు 14 మంది
బిహార్లో కూడా కరోనా కలకలం రేగింది. కరోనా వైరస్ లక్షణాల నేపథ్యంలో ఆ రాష్ట్రంలో 89 మందిని పరిశీలనలో ఉంచారు. ఇందులో ఇరాన్ నుంచి వచ్చిన వాళ్లు 14 మంది ఉన్నారు. అయితే, తమ రాష్ట్రంలో ఇప్పటిదాకా ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదని బిహార్ ఆరోగ్య శాఖా మంత్రి ప్రకటించారు. 48 మందికి పరీక్షలు చేయగా అందులో 44 మంది రిపోర్టులు నెగిటివ్గా వచ్చాయని చెప్పారు. మిగతా ముగ్గురి రిపోర్టులు రావాల్సి ఉందన్నారు.