అమరావతిపై అంతర్జాతీయ కోర్టులో పిటిషన్.. త్వరలోనే విచారణ ప్రారంభం
- ది హేగ్ లోని అంతర్జాతీయ కోర్టులో పిటిషన్ వేసిన అమెరికా ఎన్నారైలు
- పిటిషన్ కు వారంలోగా సీరియల్ నెంబర్ కేటాయించనున్న అంతర్జాతీయ కోర్టు
- త్వరలోనే విచారణ ప్రారంభం
ఏపీ రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ ఆదేశాలను జారీ చేయాలని... రాజధాని ప్రాంత రైతులకు న్యాయం చేయాలని పిటిషన్ లో ఎన్నారైలు అంతర్జాతీయ కోర్టుకు విన్నవించారు. వారం రోజుల్లోగా ఈ పిటిషన్ కు సీరియల్ నెంబర్ ను అంతర్జాతీయ కోర్టు కేటాయించనుంది. త్వరలోనే విచారణ ప్రారంభంకానుంది.
మరోవైపు, అమరావతి ప్రాంత రైతులను పోలీసుల సాయంతో వైసీపీ ప్రభుత్వం వేధిస్తోందని... ఈ విషయాలను ఐక్యరాజ్యసమితి మానవహక్కుల సంఘం దృష్టికి తీసుకెళతామని యూఎస్ ఎన్నారైలు తెలిపారు.