అయోధ్యలో ప్రత్యామ్నాయ భూమికి యూపీ సున్నీ వక్ఫ్ బోర్డు అంగీకారం

Sunni Waqf board accepts alternate land
  • ఐదు ఎకరాలను ఎలా వినియోగించుకోవాలో సోమవారం నిర్ణయం
  • మసీదు నిర్మాణం కోసం ట్రస్టు ఏర్పాటు చేయనున్న బోర్డు
  • దానికి ‘ఇండో ఇస్లామిక్ కల్చర్ ఫౌండేషన్’ పేరు పెట్టే అవకాశం
అయోధ్యలో రామమందిర నిర్మాణానికి అన్ని అడ్డంకులు తొలగిపోతున్నాయి. మసీదు నిర్మాణం కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన ఐదు ఎకరాల ప్రత్యామ్నాయ భూమికి యూపీ సున్నీ వక్ఫ్ బోర్డు అంగీకారం తెలిపింది. అయోధ్య నగరానికి దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ధన్నిపూర్ అనే గ్రామంలో ఉన్న ఈ భూమిని ప్రభుత్వం ఈ నెల ఐదో తేదీనే కేటాయించగా.. వక్ఫ్ బోర్డు శుక్రవారం ఓకే చెప్పింది. అదే సమయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాన్ని ధిక్కరించే స్వేచ్ఛ తమకు లేదంది.

మసీదు నిర్మాణం కోసం ప్రభుత్వం ఇచ్చిన ఈ భూమిని ఎలా వినియోగించుకోవాలో ఈ నెల 24న జరిగే సమావేశంలో చర్చించాలని నిర్ణయించింది. ఈ విషయంలో వివిధ రకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ స్థలంలో పాఠశాల కట్టాలని కొందరు చెబుతుంటే.. ఆసుపత్రి నిర్మించాలని మరికొందరు సూచిస్తున్నారు. దీనిపై సోమవారం జరిగే భేటీలో స్పష్టత రానుంది. అలాగే, మసీదు నిర్మాణం కోసం సున్నీ వక్ఫ్ బోర్డు ఓ ట్రస్టును కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉంది. దీనికి ‘ఇండో ఇస్లామిక్ కల్చర్ ఫౌండేషన్’ అనే పేరు ఖరారు చేసినట్టు సమాచారం.
Go Back to Shorts
Sunni Waqf board
Ayodhya Ram Mandir
Ayodhya Temple Trust
Uttar Pradesh

More Telugu News