డీజీపీని కలిసినా బీజేపీ శ్రేణులపై కేసులు ఆగడంలేదు: కన్నా
- బీజేపీ శ్రేణులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపణ
- హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయని ఆగ్రహం
- దాడులకు ప్రభుత్వ అండ ఉందంటూ మండిపాటు
ఈ సమావేశంలో కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, ఏపీలో బీజేపీ శ్రేణులపై అన్యాయంగా కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. డీజీపీని కలిసి ఫిర్యాదు చేసినా అక్రమ కేసులకు అడ్డుకట్టపడడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో హిందూ ఆలయాలపై దాడులు జరుగుతున్నాయని, ఈ దాడులకు ప్రభుత్వం అండ ఉన్నట్టు భావిస్తున్నామని అన్నారు.