మళ్లీ కట్టెల పొయ్యే గతి... విశాఖలో సీపీఐ వినూత్న నిరసన!
- గ్యాస్ ధర పెంపుపై ఆగ్రహం
- గత కొన్నాళ్లుగా విద్యుత్ చార్జీల పెంపుపైనా ధర్నాలు
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై ధ్వజం
ఈరోజు ఉదయం ఆర్టీసీ కాంప్లెక్స్ జంక్షన్లో ఏకంగా రోడ్డుపైనే కట్టెల పొయ్యి ఏర్పాటుచేసి దానిపై పాలు కాస్తూ ‘ఈ ప్రభుత్వాల హయాంలో భవిష్యత్తు ఇదే’ అంటూ నినాదాలు చేసి ఆకట్టుకుంది. గ్యాస్ సిలెండర్లను తాళ్లతో బంధించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ తక్షణం పెంచిన ధరలను ఉపసంహరించాలని డిమాండ్ చేశారు.