New Delhi: జామియా విశ్వవిద్యాలయం వద్ద కాల్పుల కలకలం.. వారం వ్యవధిలో మూడోసారి!

షార్ట్స్‌లో చూడండి

జామియా విశ్వవిద్యాలయం వద్ద మరోసారి కాల్పులు జరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలోని ఈ ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయం వద్ద వారం వ్యవధిలో ఇటువంటి ఘటన చోటు చేసుకోవడం మూడోసారి కావడం గమనార్హం. పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ) వ్యతిరేకంగా విద్యార్థులు వర్సిటీ ముందున్న రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. 

నిన్న అర్ధరాత్రి తర్వాత స్కూటీపై వచ్చిన గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు తొలుత ఐదో నంబరు గేటు, తర్వాత ఒకటో నంబరు గేటువద్ద కాల్పులు జరిపి పారిపోయారు. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. గత గురువారం రాజఘాట్ కు ర్యాలీగా వెళ్తున్న వారిపై కాల్పులు జరిగాయి.

ఆ తర్వాత రెండు రోజులకు మరోసారి ఇటువంటి ఘటన చోటు చేసుకుంది. తాజాగా మూడో ఘటన చోటు చేసుకోవడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఈ సందర్భంగా ఢిల్లీ పోలీస్ కమిషనర్ అమూల్యపట్నాయక్ మాట్లాడుతూ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బలగాలను మోహరించినట్లు తెలిపారు.  విద్యార్థులు తమ ఆందోళనను విరమించాలని విజ్ఞప్తి చేశారు.

Go Back to Shorts
New Delhi
jamiya university
firing

More Telugu News