రేపో, మాపో విద్యుత్ చార్జీలు పెంచుతారు: నారా లోకేశ్
- పెట్రో ధరలు పెరిగాయంటూ మీడియాలో కథనం
- ప్రజలపై పెట్రో బాంబు వేయడం దారుణం
- పేదల రక్తాన్ని సైలెంట్ గా తాగేస్తున్నారంటూ విమర్శలు
ఇప్పటికే ఆర్టీసీ చార్జీలు పెంచేశారని, ఇప్పుడు పెట్రోల్ ధరలు పెంచేశారని వివరించారు. ఈ క్రమంలో రేపో, మాపో విద్యుత్ చార్జీలు పెంచేందుకు వైసీపీ ప్రభుత్వం సిద్ధమవుతోందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై పెట్రో బాంబు వేయడం దారుణమని, పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని లోకేశ్ డిమాండ్ చేశారు. జగన్ పేదల రక్తాన్ని సైలెంట్ గా తాగేస్తున్నారని విమర్శించారు.