రెండున్నరేళ్ల తర్వాత తిరిగి టెన్నిస్ లోకి సానియా.. హోబర్ట్ టోర్నీలో శుభారంభం
- ఈ రోజు నాకు ప్రత్యేకమైన రోజు
- అందరికీ ధన్యవాదాలంటూ ట్వీట్
- మహిళల డబుల్స్ లో రెండో రౌండ్లోకి సానియా జోడీ
దాదాపుగా గంటన్నరకు పైగా సాగిన ఈ పోటీ హోరాహోరీగా సాగింది. తొలి సెట్లో ప్రత్యర్థి జోడీకి తేలిగ్గా లొంగిపోయిన సానియా జోడీ రెండో సెట్లో గట్టి పోటీ నిస్తూ.. విజయం సాధించింది. మ్యాచ్ నిర్ణయాత్మకమైన మూడో సెట్ నువ్వా? నేనా? అన్నట్లు ఆట సాగింది. చివరికి సానియా-నాదియా జోడీ ఆట ముందు కలష్నికోవా-మియుకాటో జోడీ నిలువలేకపోయింది.
ఈ గెలుపుపై సానియా ట్వీట్ చేస్తూ..‘ ఈ రోజు నా జీవితంలో ప్రత్యేకమైన రోజు. నా తల్లిదండ్రులు, నా కుమారుడు నాకు మద్దతుగా నిలిచారు. దాదాపుగా రెండున్నరేళ్ల తర్వాత టెన్నిస్ ఆడుతూ తొలి రౌండ్ లో నెగ్గాను. నేను విజయం సాధించాలని సందేశాలు పంపిన వారందరికి ధన్యవాదాలు’ అని పేర్కొంది.