ఆశించిన రీతిలో ఏసీబీ పనితీరు లేదంటూ సీఎం జగన్ అసంతృప్తి
- ఏసీబీపై సమీక్షా సమావేశం నిర్వహణ
- సిబ్బందికి అలసత్వం ఉండకూడదు
- అంకిత భావంతో పనిచేయాలి
ప్రజలు ఎవ్వరూ కూడా అవినీతి బారిన పడకూడదని, ఏ ప్రభుత్వ కార్యాలయంలో కూడా లంచాలు చెల్లించే పరిస్థితి ఉండకూడదని, లంచం తీసుకోవాలంటే భయపడే పరిస్థితి రావాలని అన్నారు. సెలవులు లేకుండా పనిచేయాలని, మూడు నెలల్లోగా మార్పు కనిపించాలని, కావాల్సినంత మంది సిబ్బందిని తీసుకోవాలని ఆదేశించారు. ఏసీబీకి ఎలాంటి సౌకర్యాలు కావాలన్నా కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, మరో నెల రోజుల్లో సమీక్షిస్తామని, ఆలోగా మార్పు కనిపించాలని అన్నారు.