ప్రభుత్వ రంగ సంస్థలకు క్రెడిట్ విధానంలో టికెట్లివ్వం: ఎయిర్ ఇండియా
- బకాయిలు చెల్లిస్తేనే టికెట్లు జారీచేస్తాం
- ఎయిర్ ఇండియాకు రూ.268 కోట్లు బాకీపడ్డ ప్రభుత్వ రంగ సంస్థలు
- టికెట్ల జారీలో ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం
ఈ మేరకు ఎయిర్ ఇండియా ఓ ప్రకటన చేసింది. ఇప్పటివరకు ప్రభుత్వరంగ సంస్థల నుంచి తమకు రూ.268 కోట్లు రావాల్సి ఉందని ప్రకటించింది. ఆ బకాయిలు చెల్లించేంతవరకు కొత్తగా క్రెడిట్ విధానంలో టికెట్ల జారీని నిలిపివేస్తున్నట్లు తెలిపింది. ఇదిలా వుండగా, లోక్సభ సెక్రటేరియేట్, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు సంబంధించిన శాఖలకు కొంత వరకు మినహాయింపు ఇచ్చినట్లు తెలిపింది.