స్టూవర్టుపురం నుంచి వచ్చి తెలంగాణలో పట్టుబడిన దొంగల ముఠా!
- గతంలో 20కి పైగా చోరీలు చేసిన ముఠా
- అనుమానాస్పదంగా తిరుగుతూ మఫ్టీ పోలీసులకు పట్టుబడ్డ వైనం
- పలు విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్న పోలీసులు
గతంలో జైలుకు కూడా వెళ్లి వచ్చారు. వీరు ముగ్గురూ గజ్వేల్ సమీపంలోని ప్రజ్ఞాపూర్ లో అనుమానాస్పదంగా తిరుగుతుండగా, మఫ్టీలో ఉన్న పోలీసులు పట్టుకుని విచారించారు. ఆపై వీరు చేసిన దొంగతనాల వివరాలు కూపీ లాగారు. వీరి నుంచి ఐదున్నర తులాల బంగారం, గొలుసు, 4 తులాల చంద్రహారం, 3 తులాల నల్లపూసల దండ తదితరాలతో పాటు బంగారు లాకెట్ తదితరాలను స్వాధీనం చేసుకున్నామని పోలీసు అధికారి ఒకరు తెలిపారు.