బీజేపీకి షాక్.. మరోసారి శరద్ పవార్ తో శివసేన చర్చలు
- మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటులో కొనసాగుతున్న ప్రతిష్టంభన
- పట్టువీడని బీజేపీ, శివసేన
- శరద్ పవార్ ను కలిసిన సంజయ్ రౌత్
పవార్ తో భేటీ అనంతరం సంజయ్ రౌత్ మాట్లాడుతూ, మహారాష్ట్రలోనే కాకుండా యావత్ దేశంలో పవార్ ఒక గొప్ప నేత అని కొనియాడారు. ప్రజలందరి నాయకుడంటూ కితాబిచ్చారు. ఇంతవరకు ప్రభుత్వం ఏర్పడకపోవడంపై పవార్ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో అస్థిరత్వం నెలకొందనే ఆందోళనను సమావేశం సందర్భంగా పవార్ వెలిబుచ్చారని తెలిపారు. ప్రస్తుత భేటీలో కొంత మేరకు చర్చించామని... తదుపరి సమావేశాల్లో లోతుగా చర్చిస్తామని చెప్పారు.