కేసీఆర్ మానవత్వంలేని ముఖ్యమంత్రి : కాంగ్రెస్ ఎంపీ రేవంత్రెడ్డి ధ్వజం
- కార్మికుల పట్ల కనీసం జాలి చూపడం లేదు
- ఆర్టీసీ ఆస్తులు తనవారికి కట్టబెట్టేందుకే ఈ కుట్ర
- అదే జరిగితే ఆయన జైలుకు వెళ్లడం ఖాయం
భవిష్యత్తుపై బెంగ, వర్తమానంలో బతకలేక కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే కనీసం ఆ పని చేయవద్దని ధైర్యం చెప్పే ప్రయత్నం కూడా చేయలేదని విమర్శించారు. నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను, చస్తే చావండి అన్నట్లు కేసీఆర్ తీరు ఉందన్నారు. ఆర్టీసీ అమ్మకానికి కేసీఆర్ ఎప్పుడో రంగం సిద్ధం చేశారని, అందుకే ఈ కాలయాపన అన్నారు.
ఆర్టీసీ ఆస్తులు తనవారికి కట్టబెట్టేందుకే ఈ కుట్రని, అదే జరిగితే ఆయన జైలుకు వెళ్లడం ఖాయం అన్నారు. ఏపీ ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తున్న విషయాన్ని కేసీఆర్ ఎందుకు పరిగణనలోకి తీసుకోవడం లేదని ప్రశ్నించారు. కేసీఆర్ను తెలంగాణ ఒక్క క్షణం కూడా భరించే స్థితిలేదన్నారు.