షకీబల్ పై చర్యలకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు సిద్ధం!
- ఒప్పందం ఉల్లంఘించాడంటూ నోటీసులు
- చట్టపరమైన చర్యలకు సన్నద్ధం
- ప్రమాదంలో క్రికెటర్ భవితవ్యం
బీసీబీ నియమావళి ప్రకారం కాంట్రాక్టు జాబితాలో ఉన్న క్రికెటర్లు టెలికాం సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకోరాదు.. ఈ నిబంధనను షకీబ్ ఉల్లంఘించాడంటూ అతని నుంచి వివరణను బీసీబీ కోరింది. ఒకవేళ షకీబ్ సంతృప్తికరంగా సమాధానం ఇవ్వకపోతే అతనిపై కఠిన చర్యలు తీసుకుంటామని బీసీబీ అధ్యక్షుడు నజముల్ హసన్ మీడియా తెలిపారు.
‘మేము చట్టపరంగా అతనిపై చర్యలు తీసుకోవాలనుకుంటున్నాము. ఇలాంటి ఉల్లంఘనలకు పాల్పడ్డ ఎవరినీ కూడా ఉపేక్షించం. షకీబ్ తోపాటు, టెలీకాం కంపెనీని కూడా నష్ట పరిహారాన్ని కోరతాం. షకీబ్ ఇచ్చిన వివరణ తర్వాతే చట్టపరమైన చర్యలుంటాయి’ అని హసన్ తెలిపారు.