ఫోన్లు, కంప్యూటర్ల నుంచి వచ్చే నీలిరంగు కాంతితో దుష్ప్రభావం
- మానవ కణజాలంతో పోలి ఉండే తుమ్మెదలపై పరిశోధన
- బ్లూ లైట్తో వయసు మీరిన లక్షణాలు
- మెదడు కణజాలం దెబ్బతినే అవకాశం
మానవ కణజాలంతో పోలి ఉండే తుమ్మెదలపై నిర్వహించిన పరిశోధనల ఫలితంగా వారు ఈ వివరాలు వెల్లడించారు. కృత్రిమ వెలుగు వాటి జీవిత కాలాన్ని తగ్గించినట్లు తేల్చారు. బ్లూ లైట్ నేరుగా కళ్లలోకి పడకపోయినా సరే, దానికి ఎక్స్పోజ్ అయినా కూడా ఈ దుష్ప్రభావాలు పడతాయని తెలిపారు.
ఎల్ఈడీ తరంగాలకు గురైతే మెదడు కణజాలం దెబ్బతింటుందని చెప్పారు. మానవులకు, జంతుజాలానికి సహజ కాంతి చాలా ముఖ్యమని వివరించారు. అది జీవ గడియారాన్ని ప్రభావితం చేస్తుందని చెప్పారు. ఈ వెలుగు మెదడు చురుకుదనంగా ఉండడానికి, హార్మోన్ల ఉత్పత్తితో పాటు కణజాల పునరుద్ధరణను చక్కగా క్రమబద్ధీకరిస్తుందని తెలిపారు. ఫోన్లు, ల్యాప్టాప్లు వినియోగించేటప్పుడు సరైన లెన్స్లతో ఉండే కళ్లజోడు ధరిస్తే మంచిదని సూచించారు.