సెలవులు పొడిగించడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో విద్యార్థుల తల్లిదండ్రుల సంఘం పిటిషన్

  • ఆర్టీసీ కార్మికులకు సెప్టెంబరు నెల వేతనంపై హైకోర్టులో వాదనలు 
  • విచారణ రేపటికి వాయిదా 
  • సమ్మెపై దాఖలైన మరో పిటిషన్ పై మధ్యాహ్నం 2 గంటలకు విచారణ  
కొన్ని రోజులుగా తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె కారణంగా పాఠశాలలకు సెలవులను పొడిగించడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. తెలంగాణ విద్యార్థుల తల్లిదండ్రుల సంఘం వేసిన ఈ పిటిషన్ పై హైకోర్టు వాదనలు విననుంది. మరోవైపు, కార్మికులకు సెప్టెంబరు నెల ఇవ్వాల్సిన వేతనంపై హైకోర్టు ఈ రోజు  వాదనలు విన్నది. అనంతరం దీనిపై విచారణను రేపటికి వాయిదా వేసింది. సమ్మెపై దాఖలైన మరో పిటిషన్ పై మధ్యాహ్నం 2 గంటలకు విచారణ జరగనుంది.

కాగా, ఆర్టీసీ కార్మికుల సమ్మె వల్ల విద్యాసంస్థలకు దసరా సెలవులను ఈ నెల 19 వరకు పొడిగిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఈ ఆదేశాలను కొన్ని ప్రైవేటు విద్యా సంస్థలు పట్టించుకోవడం లేదు. సెలవులతో తమ చదువుపై ప్రభావం పడుతుందని విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి విద్యా సంస్థలపై వస్తున్న ఒత్తిళ్లే ఇందుకు కారణం.
Go Back to Shorts
High Court
tsrtc
Telangana

More Telugu News