దేశంలోకి చొరబడిన 300 మంది ఉగ్రవాదులు!
- కాల్పులు జరుపుతూ కవ్విస్తున్న పాక్
- అదే సమయంలో సరిహద్దులు దాటుతున్న ఉగ్రవాదులు
- వెల్లడించిన జమ్మూ కశ్మీర్ డైరెక్టర్ జనరల్ దిల్ బాగ్ సింగ్
కవ్వింపు కాల్పులకు పాల్పడుతున్న పాక్ రేంజర్లు, అదే సమయంలో భారత సైనికుల దృష్టిని మరల్చి ఉగ్రవాదులను పంపిస్తున్నారని తెలిపారు. వీరిని గుర్తించేందుకు చర్యలు చేపట్టామని, గుల్ మార్గ్ సెక్టారులోని గందర్ బల్ సమీపంలో జరిపిన తనిఖీల్లో ఇద్దరు ఉగ్రవాదులు దొరికారని అన్నారు. ఎల్ఓసీ వెంబడి జరిపిన ఎన్ కౌంటర్లలో కొందరు ఉగ్రవాదులను మట్టుబెట్టామని చెప్పారు. అక్రమంగా చొరబడిన పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులను ఏరివేయడమే తమ లక్ష్యమని దిల్ బాగ్ సింగ్ అన్నారు.