India: వికెట్ల వేట మొదలుపెట్టిన అశ్విన్.. ముగిసిన రెండోరోజు ఆట

  • వైజాగ్ టెస్టులో భారత్ పైచేయి
  • మ్యాచ్ ను శాసించే స్థితిలో కోహ్లీ సేన
  • తొలి ఇన్నింగ్స్ 502/7 డిక్లేర్డ్
  • 39 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన సఫారీలు

వైజాగ్ లో టీమిండియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టులో ఆతిథ్య జట్టు ఆధిపత్యం కనిపిస్తోంది. తొలి ఇన్నింగ్స్ ను 502/7 వద్ద డిక్లేర్ చేసిన భారత్, ఆపై దక్షిణాఫ్రికాను స్పిన్ తో ఉక్కిరిబిక్కిరి చేసింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి సఫారీలు 3 వికెట్లు కోల్పోయి 39 పరుగులు మాత్రమే చేశారు.

 రవిచంద్రన్ అశ్విన్ 2 వికెట్లతో దక్షిణాఫ్రికాను ఆరంభంలోనే దెబ్బకొట్టగా, రవీంద్ర జడేజా ఓ వికెట్ తీసి రేసులో తానూ ఉన్నానని చాటాడు. ఓపెనర్ ఎల్గార్ 27 పరుగులతో పోరాడుతుండగా, తెంబా బవుమా (0) క్రీజులో ఉన్నాడు. స్పిన్నర్లకు విశేషంగా అనుకూలిస్తున్న విశాఖ పిచ్ పై రేపటి ఆటలో సఫారీలకు మరిన్ని కష్టాలు తప్పేట్టులేవు.

More Telugu News