తీరుమారకుంటే పాకిస్థాన్పై ఫిర్యాదు: భారత్ విదేశాంగ శాఖ స్పష్టీకరణ
- ప్రధాని మోదీ విమానాన్ని అనుమతించక పోవడంపై ఆగ్రహం
- దాయాది దేశం తన విధానాలు మార్చుకోవాలి
- విదేశాంగ నిబంధనలను గౌరవించడం నేర్చుకోవాలి
వారం రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని మోదీ అమెరికాకు వెళ్లనున్నారు. కశ్మీర్కు స్వయం ప్రతిపత్తి రద్దు చేసిన నాటి నుంచి భారత్పై రగిలిపోతున్న పాకిస్థాన్ తమ గగన తలంలోకి భారత విమాన ప్రవేశాన్ని నిషేధించిన విషయం తెలిసిందే. కొన్ని రోజుల క్రితం రాష్ట్రపతి రామ్నాథ్కోవింద్ ప్రయాణించే విమానానికి కూడా అనుమతించ లేదు. తాజాగా ప్రధాని ప్రయాణించే విమానాన్ని అనుమతించమని స్పష్టం చేసింది. పాకిస్థాన్ చర్యను భారత్ తీవ్రంగా ఖండించింది. పాకిస్థాన్ తన బుద్ధి మార్చుకుని అంతర్జాతీయ సమాజంలో తానూ భాగంగా వ్యవహరించాలని హితవు పలికింది.