అల్పాహారంతో జైలు జీవితాన్ని ప్రారంభించిన చిదంబరం
- నిన్న రాత్రి తీహార్ జైలుకు చిదంబరం తరలింపు
- ప్రత్యేక సదుపాయాలను కల్పించని అధికారులు
- నిన్న రాత్రి రోటీ, దాల్, సబ్జీలను స్వీకరించిన చిదంబరం
నిన్న రాత్రి రోటీ, దాల్, సబ్జీలను చిదంబరం స్వీకరించారు. మెడికల్ చెకప్ తర్వాత ఆయనను జైల్ నెంబర్ 7లో ఉంచారు. ఈ జైల్లో ఈడీ కేసుల్లో నిందితులను ఉంచుతారు. చిదంబరం కుమారుడు కార్తీ కూడా ఇదే సెల్ లో 12 రోజుల పాటు గడపడం గమనార్హం. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరంకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీని విధించిన సంగతి తెలిసిందే.