టోర్నీలో టర్నింగ్ పాయింట్ ఏంటో చెప్పిన సింధు తల్లి
- ప్రపంచ విజేతగా అవతరించిన పీవీ సింధు
- మురిసిపోయిన కుటుంబ సభ్యులు
- క్వార్టర్ ఫైనల్లో ఓటమి ముంగిట సింధు అద్భుతంగా పుంజుకుందన్న తల్లి
దీనిపై సింధు తల్లి విజయ మాట్లాడుతూ, ప్రతిసారి తన బర్త్ డే సందర్భంగా సింధు ఏదో ఒక కానుక ఇచ్చేదని, ఈసారి తనకు, దేశానికి ఏకంగా ప్రపంచ టైటిల్ నే బహుమతిగా ఇచ్చిందని మురిసిపోయారు. వాస్తవానికి ఈ టోర్నీలో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో సింధు కొంత క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొందని, ఆ క్వార్టర్ ఫైనల్ మ్యాచే సింధు చరిత్ర సృష్టించే క్రమంలో టర్నింగ్ పాయింట్ అనడంలో సందేహంలేదని విజయ వివరించారు.
ఆ మ్యాచ్ లో మొదటి గేము ఓడిపోయిన సింధు ఆ తర్వాత వరుసగా రెండు గేములు గెలిచి సెమీస్ కు దూసుకెళ్లిందని తెలిపారు. ఒకవేళ క్వార్టర్ ఫైనల్లో మరొక్క గేము ఓడిపోయినా సింధు ఈ ఘనత సాధించగలిగేది కాదని అన్నారు. ఇక సెమీస్, ఫైనల్లో సింధు జోరుకు ఎదురే లేకుండా పోయిందని అన్నారు.