మోత్కుపల్లి కాషాయం కండువా కప్పుకోనున్నారా?...అడుగులు అటువైపే
- సంప్రదింపులు జరిపిన కిషన్రెడ్డి, లక్ష్మణ్
- ఇంటికి వెళ్లి ఆహ్వానించినట్టు సమాచారం
- సానుకూల సంకేతాలు పంపిన దళిత నేత
దళిత వర్గాల్లో కాస్త పట్టున్న నర్సింహులు పార్టీలో చేరితే తెలంగాణలో ప్లస్ అవుతుందని భావించిన బీజేపీ అధిష్ఠానం ఇప్పటికే కేంద్రమంత్రి కిషన్రెడ్డి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్లను ఆయన ఇంటికి పంపి సంప్రదింపులు జరిపించినట్లు సమాచారం. ఇటీవలే ఈ ఇద్దరు నేతలు మోత్కుపల్లిని కలిసి దాదాపు రెండు గంటలపాటు చర్చించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా మోత్కుపల్లి కూడా సానుకూలత వ్యక్తం చేయడంతో ఆయన త్వరలోనే కాషాయ కండువా కప్పుకోనున్నారని సమాచారం.