మరోమారు రాజ్యసభకు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్!
- ఈ దఫా రాజస్థాన్ నుంచి బరిలోకి
- 1991 నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న మన్మోహన్
- కీలక నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ పార్టీ
కాగా, 26వ తేదీన రాజస్థాన్, యూపీ నుంచి ఖాళీ అయిన రాజ్యసభ స్థానాలకు ఉప ఎన్నికలను ఈసీ ప్రకటించిన సంగతి తెలిసిందే. రాజస్థాన్ లో బీజేపీ ఎంపీ మదన్ లాల్ సైనీ కన్నుమూయడంతో, యూపీలో సమాజ్వాదీ పార్టీ ఎంపీ నీరజ్ శేఖర్, బీజేపీలో చేరి రాజీనామా చేయడంతో ఈ రెండు స్థానాలూ ఖాళీ అయ్యాయి. మన్మోహన్ సింగ్ రాజ్యసభ సభ్యుడిగా 1991 నుంచి సుదీర్ఘంగా కొనసాగుతూ వచ్చారు. నాడు పీవీ నరసింహారావు తన క్యాబినెట్ లో మన్మోహన్ కు చోటు కల్పించడంతో, అసోం నుంచి రాజ్యసభకు పోటీ చేసి గెలిచారు. ఆపై నాలుగు పర్యాయాలు రాజ్యసభ సభ్యునిగా కొనసాగారు.