టీచరమ్మను అరటిపండుతో కొట్టి ఆసుపత్రి పాల్జేశారు!
- అమెరికాలో విచిత్ర సంఘటన
- అరటిపండు అలర్జీతో బాధపడుతున్న ఉపాధ్యాయురాలు
- ఆటపట్టించేందుకు టీచర్ ను అరటిపండ్లతో కొట్టిన తుంటరి విద్యార్థులు
అయితే, ముగ్గురు ఆకతాయి విద్యార్థులు ఆమెను ఇబ్బందిపెట్టాలని భావించి డోర్ హ్యాండిల్స్కు అరటిపండు గుజ్జు పూయడమే కాకుండా, తొక్కతీసిన అరటిపండ్లను గురిచూసి ఆమెపైకి విసిరారు. అరటిపండ్లు తగిలిన పావుగంటకే ఆ టీచర్ శరీర వర్ణం మారిపోయింది. దాంతో ఆమెకు అలర్జీ నిరోధక ఎపిపెన్ అనే ఔషధాన్ని ఇచ్చారు. ఆమె పరిస్థితి మరింత విషమించడంతో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ ఉపాధ్యాయురాలు ఐసీయూలో చికిత్స పొందుతోంది. పోలీసులు ఆ ముగ్గురు తుంటరి విద్యార్థులను అరెస్ట్ చేశారు.