ఆ లేఖపై నాకు అనుమానాలు ఉన్నాయి: కర్ణాటక అసెంబ్లీ స్పీకర్
- శ్రీమంత్ పాటిల్ పేరుతో నాకో లేఖ వచ్చింది
- ఈ లేఖను లెటర్ హెడ్ పై రాయలేదు
- ఆ లేఖలో తేదీ కూడా వేయలేదు
ఈ లేఖను తాను నమ్మలేనని, దీనిపై తనకు అనుమానాలు ఉన్నాయని చెప్పారు. పాటిల్ గురించి ఆరా తీయాలని, ఆయన కుటుంబాన్ని తక్షణం సంప్రదించాలని స్పీకర్ ఆదేశించారు. రేపటిలోగా తనకు ఓ నివేదిక ఇవ్వాలని హోం మంత్రికి ఆదేశాలు జారీ చేశారు. ఒకవేళ పాటిల్ కు హోం శాఖ రక్షణ కల్పించకపోతే తానే డీజీపీతో స్వయంగా మాట్లాడతానని స్పీకర్ చెప్పడం గమనార్హం.
కాగా, విశ్వాసపరీక్ష సందర్భంగా కర్ణాటక అసెంబ్లీలో కాంగ్రెస్-జేడీఎస్, బీజేపీ సభ్యుల మధ్య తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. కలిసి బయలుదేరిన తమ ఎమ్మెల్యేలు ఎనిమిది మందిలో ఒకరైన శ్రీమంత్ పాటిల్ ఆసుపత్రిలో చేరారని, మిగిలిన వారు కనిపించకుండా పోయారని కాంగ్రెస్ సభ్యుడు డీకే శివకుమార్ స్పీకర్ దృష్టికి తెచ్చారు.