తిరుపతికి బయల్దేరిన జగన్

  • తిరుపతికి రానున్న రాష్ట్రపతి
  • స్వాగతం పలికేందుకు బయల్దేరిన జగన్
  • ఇప్పటికే తిరుపతి చేరుకున్న గవర్నర్
ఏపీ ముఖ్యమంత్రి జగన్ తిరుపతికి బయల్దేరారు. విజయవాడ గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో పయనమయ్యారు. కాసేపట్లో ఆయన రేణిగుంట విమానాశ్రయానికి చేరుకోనున్నారు. భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఈ సాయంత్రం తిరుపతికి రానున్నారు. ఆయనకు స్వాగతం పలికేందుకు జగన్ తిరుపతికి వెళ్లారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో, గవర్నర్ నరసింహన్ ఇప్పటికే తిరుపతి చేరుకున్నారు. రాష్ట్రపతికి స్వాగతం పలికిన అనంతరం... సాయంత్రానికల్లా జగన్ తిరిగి విజయవాడ చేరుకోనున్నారు.
Go Back to Shorts
Jagan
Ram Nath Kovind
Narasimhan
Tirupati
YSRCP

More Telugu News