liquor: మద్యం బాటిళ్లలో మనుషుల ప్రాణం తీసే కాడ్మియం.. పరిశోధనలో వెల్లడి

  • బ్రిటన్‌లోని ప్లైమౌత్‌ యూనివర్సిటీ పరిశోధనలో వెల్లడి
  • రంగు సీసాల్లో ప్రమాదకరస్థాయిలో విష పదార్థాలు
  • హెచ్చరిస్తున్న నిపుణులు
మద్యం సీసాల్లో మనుషుల ప్రాణాలు తీసే ప్రమాదకరమైన కాడ్మియం, లెడ్ వంటి విష పదార్థాలు ఉన్నట్టు ఇటీవల జరిగిన ఓ పరిశోధనలో వెల్లడైంది. రంగు, పారదర్శకంగా ఉండే మద్యం బాటిళ్లలో ఇవి ఎక్కువ పాళ్లలో ఉన్నట్టు  బ్రిటన్‌లోని ప్లైమౌత్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తెలిపారు. మద్యం బాటిళ్లు సహా, వివిధ రంగుల్లో లభించే గాజు సీసాలు, వస్తువులు, వాటి స్టిక్కర్లపై చేసిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైనట్టు పేర్కొన్నారు. వీటిలో కాడ్మియం, లెడ్ అవశేషాలు ప్రమాదకర స్థాయిలో ఉన్నట్టు తేలిందని పరిశోధనకారులు వివరించారు. కాబట్టి రంగు సీసాల్లో లభించే మద్యం, శీతల పానీయాలు, ఇతర డ్రింక్స్‌ విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.
liquor
Bottles
coll drinks
britian
Reaserch
cadmium
Led

More Telugu News