అపస్మారక స్థితిలో గర్భిణి.. బైక్ పై ఆసుపత్రికి తరలింపు!
- అంబులెన్స్ కోసం యత్నించిన గంజు
- లతేహర్ సదార్ ఆసుపత్రికి తరలించాలని సూచన
- అంబులెన్స్ దొరక్కపోవడం దారుణమన్న వైద్యుడు
- విచారణకు ఆదేశించిన ఎస్పీ శర్మ
శాంతిదేవిని పరీక్షించిన వైద్యులు లతేహర్ సదార్ ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించడంతో అక్కడకు కూడా ద్విచక్ర వాహనంపైనే తరలించాల్సి వచ్చింది. లతేహర్ వైద్యులు రాంచీలోని రిమ్స్కు తరలించాలని సూచించడంతో అక్కడకు తరలించారు. ప్రస్తుతం శాంతిదేవిి రిమ్స్లో చికిత్స పొందుతోంది. ఈ విషయమై స్పందించిన లతేహర్ ఆసుపత్రి వైద్యుడు ఎస్పీ శర్మ మాట్లాడుతూ, శాంతిదేవికి అంబులెన్స్ ఏర్పాటు చేయకపోవడం దారుణమని, దీనిపై విచారణకు ఆదేశించినట్టు తెలిపారు. గర్భిణీల కోసం 108 వాహనంతో పాటు మమత వాహనం కూడా అందుబాటులో ఉందన్నారు.