Narendra Modi: రైతులకు పెన్షన్లు... అన్నదాతపై మోదీ సర్కారు వరాల జల్లు

షార్ట్స్‌లో చూడండి
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నూతన క్యాబినెట్ తొలిసారి సమావేశమైంది. ఢిల్లీలోని ప్రధానమంత్రి కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వ్యవసాయ రంగానికి అదనపు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. పీఎం కిసాన్ యోజన పథకం కింద ఏటా 14.5 కోట్ల మంది రైతులకు రూ.6 వేల చొప్పున ఇవ్వనున్నారు. దేశంలోని ప్రతి రైతుకు కిసాన్ యోజన వర్తింపచేయాలని తీర్మానించారు. ఈ సందర్భంగా చిన్న, సన్నకారు రైతుల పెన్షన్ పథకానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
Go Back to Shorts
Narendra Modi

More Telugu News