రేపు తిరుపతికి వెళ్లనున్న కేసీఆర్

  • సీఎం కార్యాలయం నుంచి వెలువడిన ప్రకటన
  • తెలంగాణ ఏర్పడిన సమయంలో తిరుపతి వెళ్లిన కేసీఆర్
  • కుటుంబంతో కలిసి మొక్కులు చెల్లింపు
సీఎం కేసీఆర్ తిరుపతి పర్యటనకు వెళ్లనున్నారు. ఈ విషయమై సీఎం కార్యాలయం నుంచి ఒక ప్రకటన వెలువడింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సమయంలో కుటుంబ సమేతంగా తిరుమల వెళ్లి మొక్కులు చెల్లించుకున్న ఆయన మళ్లీ ఇప్పుడు తిరుమలకు వెళ్లనున్నారు. అయితే ఆయన ఒక్కరే వెళతారా? లేదంటే కుటుంబ సమేతంగా వెళతారా? అనే విషయం తెలియాల్సి ఉంది.
Go Back to Shorts
KCR
Tirumala
Telangana
CMO

More Telugu News