వైఎస్ జగన్, మాయావతి, స్టాలిన్, నవీన్ పట్నాయక్... ప్రస్తుతం అందరి ఆలోచనా ఇదే!
- వ్యూహాలను మార్చుకున్న ప్రాంతీయ పార్టీలు
- ఏ కూటమిలో చేరకుండా వేచి చూసే ధోరణి
- ఫలితాల వెల్లడి వరకూ నిర్ణయం చెప్పరాదని నిర్ణయం
ఫెడరల్ ఫ్రంట్ పేరిట తటస్థులను ఒక తాటిపైకి తేవాలని ప్రయత్నిస్తున్న కేసీఆర్ కు సైతం వీరి నుంచి స్పష్టమైన హామీ లభించలేదు. ఇక జాతీయ స్థాయిలో కాంగ్రెస్ కూటమికి మద్దతు పలుకుతూ, పలువురు నేతలను కలిసిన చంద్రబాబుకు సైతం అదే సమాధానం వచ్చింది. వీరిద్దరూ ఏ నేతను కలిసినా, వారి నుంచి కొంతకాలం ఆగిన తరువాత నిర్ణయం తీసుకుందామన్న మాటే లభించినట్టు తెలుస్తోంది. 100కు పైగా ఎంపీ స్థానాలను తటస్థులు గెలిస్తే, బీజేపీనైనా, కాంగ్రెస్ నైనా శాసించవచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతానికి మాత్రం ప్రాంతీయ పార్టీ నేతల ఆలోచనలన్నీ ఫలితాల వరకూ వేచిచూసే దిశగానే సాగుతున్నాయి.