Pm: మోదీని కోర్టుకు ఈడుస్తా: మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ

  • డైమండ్ హార్బర్ లో బీజేపీ ర్యాలీలో మోదీ ఆరోపణలు
  • నాపై చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపాలి
  • మోదీపై క్రిమినల్, పరువునష్టం కేసులు వేస్తా
ప్రధాని మోదీపై పశ్చిమ బెంగాల్ ఎంపీ, మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ నిప్పులు చెరిగారు. ఈ నెల 15న డైమండ్ హార్బర్ లో నిర్వహించిన బీజేపీ ర్యాలీలో తనపై మోదీ చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు. మోదీ తనపై చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో మోదీని కోర్టుకు ఈడుస్తానని హెచ్చరించారు. మోదీపై క్రిమినల్, పరువు నష్టం కేసులు వేసి కోర్టు ముందు నిలబెడతానంటూ అభిషేక్ బెనర్జీ ధ్వజమెత్తారు.
Pm
modi
bjp
Trinamul
congress
abhishek

More Telugu News