కమలహాసన్ ‘హిందూ ఉగ్రవాది’ వ్యాఖ్యలను సమర్థించిన ఒవైసీ!
- గాంధీజీని చంపినవాడిని మహాత్ముడు అనాలా?
- అతను ముమ్మాటికీ టెర్రరిస్టే
- కపూర్ కమిషన్ కుట్ర కోణాన్ని నిర్ధారించింది
బాపూ గుండెల్లోకి తూటాలు పేల్చినవాడు రాక్షసుడు కాక మంచివాడు ఎలా అవుతాడని ఒవైసీ అడిగారు. ‘నాథూరాం గాడ్సే లాంటి వ్యక్తిని టెర్రరిస్ట్ అనాలా? లేక హంతకుడు అనాలా? గాంధీజీ హత్య విషయంలో కపూర్ కమిషన్ నివేదికలో కుట్ర విషయం తేటతెల్లమయింది. కాబట్టి గాడ్సేను టెర్రరిస్ట్ అనే చెప్పాలి. అతను నిజంగా ఉగ్రవాదే’ అని స్పష్టం చేశారు.