జేడీఎస్ నుంచి నేనేమీ బయటకు రాలేదు.. వాళ్లే గెంటేశారు: సిద్దరామయ్య
- బీజేపీ ప్రశ్నకు సమాధానం చెప్పిన సిద్దరామయ్య
- అహింద కార్యకలాపాలకు పాల్పడుతున్నానని బహిష్కరించారు
- దేవెగౌడ నన్ను పార్టీ నుంచి బయటకు పంపారు
‘‘నేను జేడీఎస్ నుంచి ఎందుకు బయటకు వచ్చానని బీజేపీ నేతలు అడుగుతున్నారు. నేడు జేడీఎస్ను విడిచిపెట్టలేదు. మీరు నిజం తెలుసుకోవాలి. నన్ను ఆ పార్టీ బహిష్కరించింది. నేను ‘అహింద’ కార్యకలాపాలకు పాల్పడుతున్నానని, మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత దేవెగౌడ నన్ను పార్టీ నుంచి బహిష్కరించారు. ఇప్పటికైనా మీరు నమ్ముతారని నేను అనుకుంటున్నాను’’ అని సిద్దరామయ్య పేర్కొన్నారు. కర్ణాటకలోకి మైనారిటీలు, వెనకబడి కులాలు, దళితులకు సంబంధించినదే అహింద్.
బీజేపీ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ సీఎం ఆర్. అశోక్ ఇటీవల మాట్లాడుతూ.. సిద్దరామయ్య జేడీఎస్ను వీడి కాంగ్రెస్లో ఎందుకు చేరారోనని ప్రశ్నించారు. ఆయన ప్రశ్నకు సమాధానంగా సిద్దరామయ్య ఈ వ్యాఖ్యలు చేశారు.