జగన్ కు పట్టిన శని విజయసాయిరెడ్డే.. 23 తర్వాత వైసీపీ దుకాణం మూతపడుతుంది!: ఉమ జోస్యం
- కేసీఆర్, కవిత పిటిషన్లపై కేవీపీ మౌనం ఎందుకు?
- మట్టి పనులు చేసి కోట్లు దండుకున్నారు
- జగన్ కు లబ్ధి చేకూర్చేందుకు ప్రయత్నించారు
- అమరావతిలో మీడియాతో ఏపీ మంత్రి
‘పోలవరం ప్రాజెక్టు పనులు జరుగుతుండగానే, ఇక్కడ పోలవరం పవర్ ప్రాజెక్టు పనులు చేపట్టాలని కేవీపీ ప్రయత్నించారు. ఈ దుర్బుద్ధి కారణంగా పోలవరం పనులు రెండేళ్లకుపైగా ఆగిపోయాయి. జగన్ కనుసన్నల్లో ఇక్కడ రాజమండ్రిలో ఉండవల్లి, ఢిల్లీలో కేవీపీ నాటకాలు ఆడుతున్నారు. కోట్ల మంది ప్రజలు, రైతుల గుండె చప్పుడు పోలవరం. అనవసరంగా ప్రాజెక్టు జోలికి రావొద్దు. దేశంలో ఎన్నో ప్రాజెక్టులు ఉన్నా, పోలవరం పనులు జరుగుతున్న వేగంగా ఎక్కడా ఏ ప్రాజెక్టూ సాగడంలేదు’ అని వ్యాఖ్యానించారు.
వైసీపీ అధినేత జగన్ కు పట్టిన శని విజయసాయిరెడ్డి అని ఉమ ఎద్దేవా చేశారు. మే 23 తర్వాత వైసీపీ దుకాణం మూతపడుతుందని జోస్యం చెప్పారు. పోలవరాన్ని మోదీ, విజయసాయిరెడ్డి, జగన్ ఒక్కసారి కూడా చూడలేదన్నారు. కేసీఆర్, జగన్ దర్శకత్వంలో అందరూ నాటకాలు ఆడుతున్నారని దుయ్యబట్టారు. ఇప్పటికైనా పోలవరంపై విషం చిమ్మే ప్రయత్నాలు మానుకోవాలని హితవు పలికారు.