తెలంగాణలో పదో తరగతి విద్యార్థులకు కౌన్సెలింగ్.. విద్యా శాఖ నిర్ణయం

  • ఫలితాల వెల్లడికి ముందు, తర్వాత కౌన్సెలింగ్  
  • ఈ మేరకు ప్రధానోపాధ్యాయులు చర్యలు చేపట్టాలి
  • ఫెయిల్ అయిన విద్యార్థులు కుంగిపోకుండా చూడాలి
తెలంగాణలో పదో తరగతి విద్యార్థులకు కౌన్సెలింగ్ నిర్వహించాలని విద్యా శాఖ నిర్ణయించింది. ఫలితాల వెల్లడికి ముందు, వెలువడ్డ తర్వాత కౌన్సెలింగ్ నిర్వహించాలని నిర్ణయించినట్టు సమాచారం. ప్రధానోపాధ్యాయులంతా ఆయా పాఠశాలల్లో కౌన్సెలింగ్ నిర్వహించాలని విద్యాశాఖ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 9 లేదా 10న విద్యార్థులు, తల్లిదండ్రులతో ప్రధానోపాధ్యాయులు సమావేశం నిర్వహించాలని ఆదేశించింది. ఉత్తీర్ణులైన వారికి ఉన్నత విద్యా అవకాశాలపై దిశా నిర్దేశం చేయాలని, ఫెయిల్ అయిన విద్యార్థులు కుంగిపోకుండా భరోసా కల్పించాలని విద్యా శాఖ అధికారులు ఆదేశించారు.
Go Back to Shorts
Telangana
education
10th class
counselling

More Telugu News