తెలంగాణలో ‘ఇంటర్’ అన్యాయంపై జాతీయ స్థాయిలో పోరాటం చేస్తాం!: బీజేపీ నేత లక్ష్మణ్

  • టీఆర్ఎస్ ప్రభుత్వం అణచివేస్తోంది
  • గ్లోబరినాతో అశోక్ లాలూచీ పడ్డారు
  • హైదరాబాద్ లో మీడియాతో బీజేపీ నేత
తెలంగాణలో ఇంటర్ విద్యార్థులకు జరిగిన అన్యాయంపై బీజేపీ పోరాటం చేస్తుంటే టీఆర్ఎస్ ప్రభుత్వం అణచివేస్తోందని తెలంగాణ బీజేపీ చీఫ్ లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరీక్షలకు సాంకేతిక సేవలు అందించిన గ్లోబరినా సంస్థతో ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ లాలూచీ పడ్డారని ఆరోపించారు.

ఈ వ్యవహారంలో ఇంటర్ బోర్డు నిర్లక్ష్యం, ప్రభుత్వ అలసత్వంపై పోరాటాన్ని జాతీయ స్థాయికి తీసుకెళతామని లక్ష్మణ్ ప్రకటించారు. హైదరాబాద్ లోని బీజేపీ కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ఉద్యమంలో భాగంగా ఆత్మహత్యలు చేసుకున్న 26 మంది ఇంటర్ విద్యార్థుల కుటుంబాలను బీజేపీ నేతలు నాలుగు బృందాలుగా ఏర్పడి పరామర్శిస్తామని తెలిపారు.

అలాగే ఈ నెల 9,10 తేదీల్లో రాష్ట్రపతి కోవింద్, జాతీయ మానవహక్కుల కమిషన్, కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ ను కలిసి ఈ విషయమై ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ నెల 11,12 తేదీల్లో తెలంగాణలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ శ్రేణులు ఒక్కరోజు నిరసన దీక్ష చేపడతాయని పేర్కొన్నారు.

ఆ తర్వాత మే 15,16 తేదీల్లో ఇంటర్ విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశమవుతామని చెప్పారు. ఇంటర్ విద్యార్థులకు న్యాయం జరిగేవరకూ తమ పోరాటాన్ని విరమించబోమని స్పష్టం చేశారు.
Go Back to Shorts
Telangana
TRS
inter students
suicide
BJP
laxman

More Telugu News