pm: ‘కోడ్’ అమల్లో ఉండగానే మోదీపై పుస్తకం విడుదల

  • ‘భారత్ బోధ్ కా సంఘర్ష్: 2019 కా మహా సమర్’ పుస్తకం
  • ఇది ఏ రాజకీయ నాయకుడికి సంబంధించినది కాదు
  • పుస్తక రచయిత వీసీ కులదీప్ చంద్ అగ్నిహోత్రి వివరణ
ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ ప్రధాని నరేంద్ర మోదీపై రూపొందించిన ఓ పుస్తకం ఇటీవల విడుదలైంది. ఏప్రిల్ 29న నేషనల్ బుక్ ట్రస్ట్ నిర్వహించిన జాతీయ పుస్తక ప్రదర్శనలో ఈ పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ పుస్తక రచయిత హిమాచల్ ప్రదేశ్ సెంట్రల్ యూనివర్శిటీ వీసీ కులదీప్ చంద్ అగ్నిహోత్రి.

హిందీ భాషలో రచించిన ‘భారత్ బోధ్ కా సంఘర్ష్: 2019 కా మహా సమర్’ పుస్తకాన్ని ధర్మశాల పుస్తక ప్రదర్శనలో అందుబాటులో ఉంచారు. అయితే, ఈ పుస్తకం విడుదల చేయడంపై కులదీప్ చంద్ అగ్నిహోత్రికి కుగ్రా జిల్లా ఎన్నికల అధికారి నోటీసులు జారీ చేశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో ఈ పుస్తకం ఎందుకు విడుదల చేశారో చెప్పాలని ఆ నోటీసుల్లో ఆదేశించారు.

పుస్తక రచయిత కులదీప్ చంద్ అగ్నిహోత్రి దీనికి స్పందిస్తూ, ఈ పుస్తకం ఏ రాజకీయ నాయకుడికి సంబంధించినది కాదని స్పష్టం చేశారు. భారత్ ఎదుర్కొంటున్న సమస్యలు, రాజకీయ పరిణామాలపై లోతైన విశ్లేషణ ఉందని చెప్పారు. గత పదిహేనేళ్లలో జరిగిన రాజకీయ పరిణామాలపై వ్యాసాల సంపుటి మాత్రమేనని స్పష్టం చేశారు.  
pm
modi
Himachal Pradesh
kuladeep chand

More Telugu News