మమత బయోపిక్ ‘బాఘిని: బెంగాల్ టైగ్రెస్’కు బీజేపీ మోకాలడ్డు
- పీఎం నరేంద్రమోదీ సినిమాను సమీక్షించినట్టుగానే దీనినీ సమీక్షించాలని కోరిన బీజేపీ
- ఎన్నికల సంఘం, బెంగాల్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్లకు లేఖలు
- మమత బయోపిక్ కాదంటున్న దర్శకనిర్మాతలు
అయితే, బీజేపీ అభ్యంతరాలను సినిమా దర్శకనిర్మాతలు కొట్టిపడేశారు. నిజానికి ఈ సినిమా మమత బయోపిక్ కాదని, ఆమె జీవితం నుంచి స్ఫూర్తి పొంది రాసుకున్న కథ మాత్రమేనని పేర్కొన్నారు. ‘బాఘిని:బెంగాల్ టైగ్రెస్’ సినిమాలో నాయకురాలు ఇందిరా బందోపాధ్యాయ్ పాత్రలో రుమా చక్రవర్తి నటించారు. అమెను అందరూ ‘దీదీ’ అని పిలుస్తుంటారు. దీనికి తోడు ఈ సినిమా ట్రైలర్లో ఇందిర పాత్ర మమతను పోలి ఉండడం కూడా బీజేపీ అభ్యంతరాలకు ఓ కారణం.
అంతేకాదు, అప్పట్లో జరిగిన సింగూరు, నందిగ్రామ్ ఉద్రిక్తతలను కూడా ఈ సినిమాలో ప్రస్తావించారు. అప్పటి సీపీఎం ప్రభుత్వం మీద ‘పరివర్తన్’ పేరుతో మమత తలపెట్టిన ర్యాలీ గురించి కూడా చూపించారు. దీంతో ఈ సినిమాను మమత జీవిత చరిత్ర ఆధారంగానే రూపొందించారని బీజేపీ వాదిస్తోంది. అందుకే విడుదలను అడ్డుకోవాలంటూ ఎన్నికల సంఘం, బెంగాల్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్లకు లేఖ రాసింది. బీజేపీ అభ్యంతరాలు ఎలా ఉన్నా ‘బాఘిని:బెంగాల్ టైగ్రెస్’ సినిమాకు సెన్సార్ బోర్డు ఇప్పటికే క్లియరెన్స్ సర్టిఫికెట్ ఇచ్చినట్టు సమాచారం.