టీడీపీ ఎంపీ మురళీమోహన్ పై కేసు నమోదు చేసిన సైబరాబాద్ పోలీసులు!
- ఈరోజు రూ.2 కోట్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు
- ఇద్దరు జయభేరి సంస్థ ఉద్యోగులు అదుపులోకి
- డబ్బును మురళీమోహన్ కు ఇచ్చేందుకు తీసుకెళుతున్నామన్న నిందితులు
ఈ నగదును తీసుకెళుతున్న వ్యక్తులను నిమ్మలూరి శ్రీహరి, పండరిగా గుర్తించామని తెలిపారు. వీరిద్దరూ జయభేరి కంపెనీలో పనిచేస్తున్నారన్నారు. ఎలాంటి పత్రాలు లేకుండా రూ.2 కోట్ల నగదును రైలు ద్వారా తరలించేందుకు వీరు ప్రయత్నించారని వ్యాఖ్యానించారు.
జయభేరీ సంస్థకు చెందిన ధర్మరాజు, జగన్మోహన్ ఈ డబ్బును టీడీపీ నేత మురళీ మోహన్ కు అందించాల్సిందిగా చెప్పినట్లు నిందితులు శ్రీహరి, పండరి అంగీకరించారన్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ ఎంపీ మురళీ మోహన్, యలమంచిలి మురళీకృష్ణ, జగన్మోహన్, ధర్మరాజు, పండరి, శ్రీహరిలపై కేసు నమోదు చేశామని సజ్జనార్ తెలిపారు. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 171బీ, 171ఈ, 171సీ, 171 ఎఫ్ కింద కేసు నమోదు చేశామన్నారు.