వాట్సాప్లో పదో తరగతి ప్రశ్నపత్రం.. కర్నూలు జిల్లాలో కలకలం
- పరీక్ష ప్రారంభమైన అరగంటకే వాట్సాప్లో క్వశ్చన్ పేపర్ చక్కర్లు
- పోలీసులకు ఫిర్యాదు చేసిన విద్యాశాఖాధికారులు
- పరీక్ష కేంద్రంలోని సిబ్బందిపై అనుమానం
పరీక్ష కేంద్రంలో విధులు నిర్వర్తించిన సిబ్బందే ప్రశ్నప్రత్రాన్ని మొబైల్లో ఫొటో తీసి వాట్సాప్ చేసి ఉంటారని భావిస్తున్నారు. విచారణ జరిపి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కర్నూలు జిల్లా విద్యాశాఖాధికారి తహెరాసుల్తాన పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ ప్రశ్నపత్రం తొలుత ఏ నంబరు నుంచి షేర్ అయిందన్న విషయాన్ని ఆరా తీస్తున్నారు.