జనసేనలో చేరిన ఎస్పీవై రెడ్డికి చంద్రబాబు తాజా ఆఫర్!
- టీడీపీ గెలుపు కోసం ఎస్పీవై రెడ్డి సహకరించాలి
- ముగ్గురు దుర్మార్గులతో నేను పోరాటం చేస్తున్నా
- వైసీపీకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి?
ఇటీవల జనసేనలో చేరిన ఎంపీ ఎస్పీవై రెడ్డికి ఈ సందర్భంగా చంద్రబాబు బంపర్ ఆఫర్ ఇచ్చారు. నంద్యాలలో టీడీపీ గెలుపుకు ఎస్పీవై రెడ్డి సహకరించాలని... అలాగైతే, ఆయన కుటుంబానికి గౌరవప్రదంగా ఎమ్మెల్సీ పదవి ఇస్తానని హామీ ఇచ్చారు. కనిగిరి టీడీపీ అభ్యర్థి ఉగ్రనరసింహారెడ్డి ఆస్తులపై కావాలనే ఐటీ దాడులు చేయించారని మండిపడ్డారు.