41 మంది బీసీలకు, ఐదుగురు ముస్లింలకు టికెట్లిచ్చిన వైసీపీ!
- చాలాకాలం తరువాత బీసీలకు పెద్దపీట
- చంద్రబాబులా తప్పు లెక్కలు కట్టడం లేదు
- గతంలోకన్నా ముస్లింలకు ఓ సీటు అధికం
- వైసీపీ అధినేత వైఎస్ జగన్
చంద్రబాబునాయుడు బలిజ కులస్తులకు ఇచ్చిన టికెట్లను బీసీల జాబితాలో చేర్చారని ఆరోపించిన వైఎస్ జగన్, తమ జాబితాలోని బలిజ వర్గం నేతలను కలిపితే, బీసీలకు 45 సీట్లు ఇచ్చినట్లు అవుతుందని అన్నారు. గతంతో పోలిస్తే ముస్లింలకు ఈ దఫా వైసీపీలో ఓ సీటు అధికంగా దక్కిందని గుర్తు చేశారు. తమ పార్టీ తరఫున ఐదుగురు ముస్లింలు పోటీ పడుతున్నారని చెప్పారు. ఈ జాబితాలోని ప్రతిఒక్కరూ గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్టు జగన్ వ్యాఖ్యానించారు. ప్రజాభిప్రాయం, తాము జరిపించిన సర్వేల్లో వచ్చిన అభిప్రాయాల మేరకు కొందరు సిట్టింగ్ లకు టికెట్లను ఇవ్వలేకపోయామని అన్నారు.