మనీల్యాండరింగ్‌ కేసులో మాజీ మంత్రి కొడుక్కి ఏడేళ్ల జైలు

  • నిందితుడు డీఎంకే మాజీ మంత్రి మణి తనయుడు
  • ఎటువంటి పత్రాల్లేకుండా విదేశీ సంస్థలకు రూ.78 కోట్లు
  • కేసు నమోదుచేసి దర్యాప్తు చేసిన ఈడీ
మనీల్యాండరింగ్‌ కేసులో తమిళనాడుకు చెందిన ఓ మాజీ మంత్రి కొడుక్కి ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తూ చెన్నైలోని సీబీఐ కోర్టు తీర్పు ఇచ్చింది. ఎటువంటి పత్రాలు, అనుమతులు లేకుండా విదేశీ సంస్థలకు రూ.78 కోట్లు తరలించారని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ నమోదు చేసిన కేసులో కోర్టు ఈ విధంగా తీర్పు చెప్పింది.

వివరాల్లోకి వెళితే... డీఎంకే ప్రభుత్వ హయాంలో కరుణానిధి మంత్రి వర్గంలో తిరువాన్మియూర్‌కు చెందిన దివంగత కె.సి.మణి మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో ఆయన కుమారుడు మణిఅన్బళగన్‌ థౌజండ్‌ లైట్స్‌ ప్రాంతంలోని ఓ బ్యాంకు నుంచి ఎలాంటి పత్రాల్లేకుండా విదేశీ సంస్థకు రూ.78 కోట్లు పంపించారు. దీన్ని గుర్తించిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అప్పట్లో కేసు నమోదు చేసింది. ఈ కేసు విచారించిన చెన్నై కోర్టు నిందితుడు మణిఅన్బళగన్‌కు ఏడేళ్ల జైలు శిక్షతోపాటు కోటి రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చింది. 
Go Back to Shorts
Tamil Nadu
ED case
seven years prision
ex minister son

More Telugu News