ఇస్లామిక్ కోఆపరేషన్ సదస్సును బహిష్కరించిన పాకిస్థాన్

  • ఓఐసీ సదస్సుకు విశిష్ట అతిథిగా హాజరవుతున్న సుష్మా స్వరాజ్
  • అభ్యంతరం వ్యక్తం చేసిన పాకిస్థాన్
  • ఓఐసీలో 57 సభ్య దేశాలు
పాకిస్థాన్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. అరబ్ దేశాల ప్రతిష్టాత్మక 'ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్' సదస్సును బహిష్కరించింది. ఈ మేరకు పాక్ విదేశాంగ మంత్రి మొహ్మద్ ఖురేషీ ప్రకటించారు. ఈ సదస్సుకు భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ విశిష్ట అతిథిగా హాజరుకానుండటమే దీనికి కారణం. ఈ సందర్భంగా ఖురేషీ మాట్లాడుతూ, యూఏఈ విదేశాంగ మంత్రితో మాట్లాడానని.... సుష్మాస్వరాజ్ ఈ సదస్సుకు హాజరవుతుండటంపై అభ్యంతరాలను వివరించానని చెప్పారు.

మరోవైపు ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ (ఓఐసీ)లో 57 సభ్య దేశాలు ఉన్నాయి. కశ్మీర్ పై మొదటి నుంచి పాకిస్థాన్ కు ఓఐసీ సానుకూలంగా వ్యవహరిస్తూ వస్తోంది.
Go Back to Shorts
oic
sushma swaraj
pakistan
uae

More Telugu News