'ఇండియాకు సిగ్గులేదు' అన్న పాక్ లాయర్... ఆగ్రహోదగ్రుడైన హరీశ్ సాల్వే!
- పాక్ జైల్లో మగ్గుతున్న కుల్ భూషణ్ జాదవ్
- ఐసీజేలో కొనసాగుతున్న వాదనలు
- పాక్ న్యాయవాది ఖవార్ ఖురేషీ భాషపై అభ్యంతరం
ఇండియాకు సిగ్గులేదని, అర్థం లేని వ్యాఖ్యలు చేస్తోందని, ఆ దేశం పొగరుబోతని పాక్ తన పత్రాల్లో అభ్యంతరకర భాషను వాడగా, ఇటువంటి భాషను మరోసారి వాడకుండా చర్యలు చేపట్టాలని సాల్వే కోరాడు. పాక్ తరఫున కేసులో వాదనలు వినిపించేందుకు వచ్చిన ఖవార్ ఖురేషీ ఎలా వాదించాలో తెలియని స్థితిలోనే ఈ తరహా దుర్భాషకు దిగుతున్నారని భారత్ ఆరోపించింది.