నేను ప్రమాదానికి గురయ్యానని వస్తున్న వార్తలు నా కుటుంబాన్ని కలచి వేశాయి: క్రికెటర్ సురేశ్ రైనా
- దేవుడి దయవల్ల బాగానే ఉన్నా
- ఇలాంటి వార్తలు పట్టించుకోకండి
- ఆ యూట్యూబ్ ఛానళ్లపై ఫిర్యాదు చేశా
రైనా కుటుంబ సభ్యులు సైతం ఆయన గురించి జరుగుతున్న దుష్ప్రచారానికి కలత చెందాడు. తాజాగా రైనా తనపై జరుగుతున్న దుష్ప్రచారంపై ట్విట్టర్ ద్వారా స్పందించాడు. తాను దేవుడి దయవల్ల బాగానే ఉన్నానని పేర్కొన్నాడు. ‘‘నేను కారు ప్రమాదానికి గురయ్యానని కొన్ని రోజులుగా వస్తున్న వార్తలు అసత్యం. ఇవి నా కుటుంబాన్ని, స్నేహితులను తీవ్రంగా కలచివేశాయి. ఇలాంటి వార్తలు పట్టించుకోకండి. దేవుడి దయ వల్ల నేను బాగానే ఉన్నాను. ఆ యూట్యూబ్ ఛానళ్లపై ఫిర్యాదు చేశా. త్వరలోనే కఠిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నా’’ అని సురేశ్ రైనా ట్వీట్ చేశాడు.