ఈసీ అధికారులను ఇరవై మూడు పార్టీల ప్రతినిధులం కలిశాం: సీఎం చంద్రబాబు
- ఎన్నికలు పూర్తి పారదర్శకంగా నిర్వహించాలి
- పేపర్ బ్యాలెట్ పద్ధతిని అనుసరించాలి
- ఈసీ సరైన నిర్ణయం తీసుకుంటుందని నమ్మకం
పోలైన ఓట్లలో 50 శాతం వీవీ ప్యాట్ స్లిప్స్ లెక్కించాలని డిమాండ్ చేస్తున్నామని, వీటిని లెక్కించడమన్నది పెద్ద విషయమేమీ కాదని సూచించారు. ప్రజాస్వామ్యం కోసం ప్రజలకు నమ్మకం కలిగించాల్సిన అవసరం ఉందని, ఈవీఎం యంత్రాల్లో ఒక పార్టీ గుర్తు నొక్కితే మరో పార్టీకి వెళ్తున్నాయని, దీనిపై ప్రతి ఒక్కరిలో సందేహాలున్నాయని అన్నారు. ప్రజల్లో విశ్వాసం కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందని, తద్వారా ప్రజాస్వామ్యంపై ప్రజలకు నమ్మకం కలుగుతుందని అభిప్రాయపడ్డారు. ఎన్నికల సంఘం సరైన నిర్ణయం తీసుకుంటుందన్న నమ్మకం తమకు ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.