భువనేశ్వర్ నుంచి విజయవాడకు బస్సు సర్వీసులు.. ప్రారంభించిన సీఎం నవీన్ పట్నాయక్
- జెండా ఊపి బస్సును ప్రారంభించిన సీఎం పట్నాయక్
- ప్రయాణికుల సౌకర్యం కోసమేనన్న సీఎం
- మరిన్ని సర్వీసులు అందుబాటులోకి తెస్తామని ప్రకటన
విజయవాడతోపాటు కోల్కతా, భంజానగర్, రాజ్ గంగాపూర్, బుర్లా నగరాలకు మరో 23 ఎక్స్ప్రెస్ బస్సు సర్వీసులను అందుబాటులోకి తీసుకొస్తామని ఈ సందర్భంగా నవీన్ పట్నాయక్ పేర్కొన్నారు. ఈ హై-ఎండ్ బస్సుల్లో ఉచిత వై-ఫై, సీసీటీవీ, మొబైల్ చార్జింగ్, జీపీఎస్ ట్రాకింగ్, వాటర్ బాటిల్స్ ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయన్నారు.